Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్
ఇవాళ ఐటీ అధికారులు ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది అన్న కక్షతోనే ఆ మీడియా సంస్థపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
ఈ తరుణంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా దీనిపై స్పందించారు. మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మీడియాను కూడా కేంద్రం అణగదొక్కుతున్నదని, దానిలో భాగమే బీబీసీపై ఐటీ దాడులు అని వ్యక్తం చేశారు.