Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతపురం : జిల్లాలోని గుంతకల్లో దారుణఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ దగ్గర దుండగులు ఇద్దరిని కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు కోటిరెడ్డి, షేకావళిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులను ఎందుకు చంపారు? వీరిపై ఎవరికైనా కక్ష ఉందా? లేక అక్రమసంబంధాలా? కుటుంబ గొడవలే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. అలాగే దుండగులు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.