Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. గత 21 రోజుల్లో హుండీల ద్వారా రూ.1,83,39,667 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 128 గ్రాముల బంగారం, మూడు కిలోల 200 గ్రాముల బంగారం వచ్చిందని తెలిపారు. అమెరికాకు చెందిన 2,079 డాలర్లు, యూఏఈ దిర్హమ్స్ 25, ఆస్ట్రేలియా డాలర్ 240, కెనడా డాలర్స్ 140, ఒమాన్ రియాల్స్ 21, మలేషియా రింగిట్స్ 20, కువైట్ దినార్స్ 20, న్యూజిలాండ్ డాలర్స్ 90, బహ్రెయిన్, సూడాన్తో పాటు పలు దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు వచ్చాయని ఆలయ అధికారులు వివరించారు.