Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్ల నష్టంతో 60,809 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 17,869 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.86 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, హెచ్యూఎల్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, పవర్గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ, టైటన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.