Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండినాణెం ముద్రణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో హైదరాబాద్లో ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నుంచి మింట్ అధికారులు సలహాలు, సూచనలను స్వీకరించారు.
అయితే ఎన్టీఆర్ పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ను కోరానని పురందేశ్వరి తెలిపారు. నిర్మలా సీతారామన్ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న క్రమంలో మింట్ నుంచి ఆమోదం వచ్చిందని, దీనికి సంబంధిత అధికారులు 3 ఫొటోలను పరిశీలించారని తెలిపారు. నాణెం రూపకల్పన ప్రొసీజర్కు నెలరోజుల సమయం పడుతుందని ఆ తర్వాతే విడుదల చేస్తారని వివరించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.