Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
నవతెలంగాణ - ఢీల్లీ
పెట్రోల్, డీజిల్, గ్యాస్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు అంగీకరిస్తే వెంటనే వాటిని జీఎస్టీ కిందకు తీసుకొస్తామన్నారు. బుధవారం ఆమె పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులతో బడ్జెట్ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తరుణంలో వస్తు, సేవల పన్ను పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ‘‘రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాధ్యమవుతుందని తెలిపారు.