Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరికా
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో 39 మంది వలసదారులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పనామాలో 60 మందికి పైగా వలసదారులతో ప్రయాణిస్తున్న బస్సు కొండపై నుండి పడిపోవడంతో కనీసం 39 మంది మరణించారని ఆ దేశ మైగ్రేషన్ అధికారులు తెలిపారు. అయితే ఇది సెంట్రల్ అమెరికా దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన వలస ప్రమాదంగా గుర్తించబడింది. కొలంబియా నుంచి డేరియన్ లైన్ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఓ శిబిరానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు. మైగ్రేషన్ అధికారులు బాధితుల జాతీయతలపై వివరాలను అందించలేదు. మొదట ప్రయాణీకుల బంధువులు, సంబంధిత రాయబార కార్యాలయాలతో కమ్యూనికేట్ చేస్తుంది.