Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. బుధవారం ఉదయం హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రీషెడ్యూల్ చేయడంతోపాటు మరికొన్ని రైళ్లను రద్దుచేశారు. పలు రైళ్లను దారిమళ్లించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది. ఆ క్రమంలో మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా మధ్యాహ్నం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నది.