Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 379 పాయింట్ల లాభంతో 61,654 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 18,129 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్ తప్ప మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, సన్ఫార్మా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా లాభపడుతున్న షేర్లలో ఉన్నాయి.