Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్థాన్
నిత్యావసర ధరలతో తొనికిసలాడుతున్న పాకిస్థాన్ తాజాగా ఇంధన ధరలను మళ్లీ పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ. 272కు చేరుకుంది. విదేశీ మారకద్రవ్యం నిల్వలు అడుగంటడంతో అలమటిస్తున్న పాకిస్థాన్ విదేశీసాయం కోసం తీవ్రప్రయత్నాలు చేస్తోంది.
పెట్రోల్తో పాటూ డీజిల్ ధరలు కూడా పెంచడంతో లీటర్ రూ.280కు చేరుకుంది. లీటర్ కిరోసిన్ ధర రూ.202.70కు చేరుకుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ తరుణంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. అయితే నిధుల విడుదలకు ఐఎమ్ఎఫ్ విధించిన నిబంధనల మేరకు పాక్ ఈమారు పెట్రోల్ ధర ఏకంగా రూ.22.20(పాకిస్థానీ రూపయ్యా) మేరకు పెంచింది.