Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అగర్తల
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. సీఎం మాణిక్ సాహా అగర్తలాలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన బొర్డోవాలి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఈ తరుణంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాగా, ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం ఓట్లు నమోదయ్యాయి.