Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ప్రమాదానికి గురైనవి ఎల్హెచ్బీ (లింకు హాఫ్మన్ బుష్)బోగీలు కావడంతో ప్రమాదం నుండి బయటపడింది. యాంటీ టెలిస్కోపిక్ టెక్నాలజీతో వీటిని రూపొందించడం వల్ల పట్టాలు తప్పినప్పుడు కోచ్లు విడిపోతాయి. రెండు బోగీలు ఢీకొట్టుకోవడం పక్కకు పడిపోవడం జరగదు. ఇలాగే గోదావరి ఎక్స్ప్రెస్ బోగీలు 6 విడిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో వివరించారు. అలాగే ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్, ఎయిర్ డిస్కు బ్రేకులు ఉండడంతో కూడా ఒక బోగీపైకి మరొకటి వెళ్లలేదని తెలిపారు.
గోదావరి ఎక్స్ప్రెస్లో దాదాపు 1500 మంది ప్రయాణిస్తున్నారని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పట్టాలు తప్పిన 6 బోగీల్లో ఒకటి జనరల్ బోగీ కాగా అందులో 120 మంది వరకూ ప్రయాణికులుంటారని అంచనా వేశారు. ఒకటి సరకు రవాణా బోగీ. మిగతా 4 స్లీపర్ క్లాస్వి. ఈ నాలుగింటిలో 300 మంది వరకూ ఉంటారని అధికారులు అంచనా వేశారు.