Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకిలో రాజీనామ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ తరుణంలో గురువారం గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం తన రాజీనామాను ప్రకటించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడనున్నారు. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ నేడు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
బీజేపీకి రాష్ట్ర నాయకత్వంలోని ఓ కోటరీ కన్నాను లక్ష్యంగా చేసుకుందని ఆయన సన్నిహితులు, మద్దతుదారులు గతకొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఆ కోటరీ చర్యలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నా అధినాయకత్వం జోక్యం చేసుకోకపోవడం వారి చర్యలకు మరింత ఊతమిచ్చినట్టవుతోందన్న అసంతృప్తి కన్నా శిబిరంలో ఉండేది. కన్నాను రాజకీయంగా దెబ్బతీసే తరుణంలో ఆయన హయాంలో నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షులు కొందర్ని అర్ధంతరంగా తొలగించారని ఆయన సన్నిహితులు కొందరు తెలిపారు.