Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి
రాజేంద్రనగర్ తేజస్వీ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గుర్రపు స్వారీ బెట్టిం నిర్వహిస్తుండగా 13 మందిని పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 17 మొబైల్ ఫోన్లు, 19 డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, రూ.51 వేల నగదు హార్స్ రేసింగ్ గైడ్ బుక్తో పాటు ఓ కారును సీజ్ చేశారు. తేజస్వీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిర్వాహకుడు తిరుమల్ రెడ్డి వాట్స్ఆప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో గుర్రపు స్వారీ సమాచారం పోస్టు చేస్తున్నాడు. ఈ తరుణంలో ఆర్ఎస్ వరల్డ్ అనే గ్రూప్ ద్వారా తిరుమల్ రెడ్డి గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వారు అందరూ బాడా వ్యాపారస్తులుగా గుర్తించారు. పట్టుబడ్డ 13 మందిపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.