Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు దూసుకుపోయాయి. బిలియనీర్ అదానీ గ్రూప్ కు చెందిన కంపెనీల షేర్లు ఈరోజు భారీగా పెరిగాయి. తమ బ్యాలెన్స్ షీట్ చాలా బాగుందని అదానీ గ్రూప్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో ధీమా నెలకొంది. దీంతో ఉదయం మార్కెట్లు భారీగా పెరిగాయి. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో క్రమంగా లాభాలు తగ్గుతూ వచ్చాయి. ట్రేడింగ్ ముగిసే చివరి క్షణంలో మార్కెట్లు నష్టాల్లోకి కూడా వెళ్లాయి. ఆ వెంటనే మళ్లీ కాస్త కోలుకుని లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 44 పాయింట్లు లాభపడి 61,320కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది.