Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు(72) శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన 10 గంటల వరకు పార్టీ నాయకులతో కలిసి గడిపి ఇంటికి వెళ్లారు. తరువాత గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.