Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం కొనేవారికి గత మూడు రోజులుగా శుభవార్తలు మీద శుభవార్తలు అందుతున్నాయి. బులియన్ మార్కెట్లో కొన్ని రోజుల పాటు పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా దిగి వస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పసిడి ధరలు తగ్గాయి. ఏకంగా రూ.53 వేలు దాటిన 22 క్యారెట్ల బంగారం ఇప్పుడు రూ.51 వేలకు చేరుకుంది. ఈ నెలలో దాదాపు రూ.200 వరకూ తగ్గింది. శనివారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 తగ్గి రూ.51,800కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 తగ్గి రూ.56,510కి చేరుకుంది. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శనివారం కిలో వెండిపై రూ.400 తగ్గి రూ.68,600కి చేరింది.