Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. అసోంకు చెందిన అన్నదమ్ములు రోజువారి కూలీలుగా పనిచేస్తూ బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు. మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నగదు చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరినట్లు పోలీసులు గుర్తించారు.