Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మేల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ తరుణంలో మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజులలో కేసీఆర్ దేశంలోనే గొప్ప నాయకుడవుతారని అన్నారు.
కురవి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఐదు కోట్ల రూపాయలను కేటాయించగా వీటితో 75 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాది శివరాత్రి కల్లా పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. అంతే కాకుండా ఈ క్రమంలో కురవి ప్రాంతాన్నిత్వరలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆమె శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కురవి జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్ , జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, బీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వల్లూరి కృష్ణారెడ్డి, నెహ్రు నాయక్, జీవన్ నాయక్, బొడ శ్రీను నాయక్, భద్రు, నాగన్న, డాక్టర్ సుందర్ నాయక్, బొమ్మకంటి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.