Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టర్కీ
తుర్కియేలో ఈమధ్య వచ్చిన భారీ భూకంపం యువ ఫుట్బాలర్ను బలిగొన్నది. భూకంపం కారణంగా క్రిస్టియన్ అత్సు అనే 31 ఏళ్ల ఫుట్బాలర్ మరణించాడు. సహాయక బృందాలు దాదాపు 12 రోజుల తర్వాత శిథిలాల కింద ఇతని మృతదేహాన్ని గుర్తించాయి. క్రిస్టియన్ అంటక్యా సిటీలో ఉండేవాడు. ఫిబ్రవరి 6న తుర్కియేలో భూమి ప్రకంపనలు మొదలైప్పటి నుంచి క్రిస్టియన్ జాడ దొరకలేదు. దాంతో, అతడి ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు. కానీ, అవేవీ ఫలించలేదు. దాంతో, తుర్కియే ఫుట్బాల్లో విషాదం చోటుచేసుకుంది.