Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వేగం పెంచింది. ఐరోపాలో తన పరిధిని విస్తరించేందుకు టర్కిష్ ఎయిర్లైన్స్తో తన భాగస్వామ్యాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ తరుణంలో యూరోపియన్ దిగ్గజం ఎయిర్బస్ నుండి ఇప్పటికే ఆర్డర్ చేసిన 500 అదనపు విమానాలను అందుకోనున్నట్లు ఎయిర్లైన్ తెలిపింది. ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇండియా నుంచి ఇస్తాంబుల్, ఐరోపాకు ప్రయాణీకుల సేవలను మెరుగు పరచడంలో తమ తాజా కొనుగోలు సాయపడుతుందని తెలిపారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను నడుపుతోందని, వాటిలో 10 శాతం అంతర్జాతీయ రూట్లలో నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.