Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సంవత్సరాల తరబడి ప్రమోషన్ లేకపోయినా, పాఠశాలల్లో వివక్షకు గురౌతున్నా విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందని టీఎస్యుటీఎఫ్ నేతలు మండిపడ్డారు. ఈ తరుణంలో ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్లో కూడా తమ పదోన్నతుల అంశం లేకపోవడంతో ఆవేదనకు గురైన భాషా పండితులు తమ జాబ్ చార్ట్ లో లేని హైయర్ క్లాస్ బోధన చేయబోమని ఇచ్చిన పిలుపు నిరసన మాత్రమే అన్నారు.
అయినా వారు అనధికారికంగా పాఠాలు బోధిస్తూనే ఉన్నారని, నిరసన లేఖల ఆధారంగా రంగారెడ్డి, సంగారెడ్డి విద్యాధికారులు భాషా పండితులపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమన్నారు. డీఈఓల చర్యను టీఎస్యుటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందని, భాషాపండితులపై వేసిన సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తివేయాలని, పదోన్నతులపై ఉన్న కేసును ప్రభుత్వం చొరవతీసుకుని వేకెట్ చేయించి, ప్రస్తుత పదోన్నతుల షెడ్యూల్లోనే పండితులకు సైతం పదోన్నతులు ఇవ్వాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నదన్నారు.