Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీ క్రియేటివిటీ, కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్గా నటుడు ఎల్.జోగి నాయుడును నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరుణంలో జోగి నాయుడు నియామకానికి సంబంధించి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ సీఈవో నుంచి వచ్చిన సిఫారసుల మేరకు జోగినాయుడును క్రియేటివ్ హెడ్గా నియమిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పదవిలో ఆయన ఎంతకాలం కొనసాగుతారు, ప్రభుత్వం ఎంత వేతనం చెల్లించనుందన్న అంశాలను జీవోలో తెలుపలేదు. అయితే ఎల్.జోగి నాయుడుకి పి కేటగిరిలో వేతనం, ఇతర అలవెన్సులు వర్తిస్తాయనికి తెలిపింది.