Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. నగరంలోని మోకిలలోని తన తరలించారు. తారకరత్నను కడసారి చూసేందుకు నందమూరి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఈ తరుణంలో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తారకరత్న మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లరి నరేశ్ పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.