Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
వైఎస్ షర్మిలారెడ్డి ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా పాదయాత్రను మహబూబాబాద్ బేతోలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
శనివారం సాయంత్రం మహబూబాబాద్లో వైతెపా ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్ శాసనసభ్యుడు బానోతు శంకర్నాయక్ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని భారాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన తరుణంలో ఆదివారం షర్మిలను అరెస్ట్ చేశారు. తన కారవాన్ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీసులు తీసుకెళ్లారు. అయితే షర్మిలను హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది.