Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది. సుమారు 10 సెకన్ల భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ మండలాల్లో గతంలోనూ పలుమార్లు భూమి కంపించించి.
ఇక ఆంధ్రప్రదేశ్లోని పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాదిపాడులోని జడేపల్లి తండా, కంచిబోడు తండాల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం స్వల్వ వ్యవధిలో భారీ శబ్ధంతో రెండుసార్లు భూమి కంపించిందని స్థానిలు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్లలోనుంచి బయటకు పరుగులుతీశారు.