Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్లో 263 రన్స్కే కట్టడిచేసిన భారత స్పిన్నర్లు మరోసారి తమ సత్తా చాటారు. టీమ్ఇండియా బౌలర్ రవీంద్ర జడేజా విజృంభించడంతో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో 115 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందుంచింది.
ఇక టాపార్డర్ విఫలమవడంతో టీమ్ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ కంటే 1 పరుగు వెనుకపడిపోయింది. ఒకదశలో 137 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఆదుకున్న విషయం తెలిసిందే. అయితే 1 పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్ రవీంద్ర జడేజా కంగారుపెట్టించాడు. వరుగా వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశాడు. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై జడేజా ఒక్కడే ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన వికెట్లను సీనియర్ బౌలర్ అశ్విన్ పడగొట్టాడు.