Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ నెల 25న మహారాష్ట్రలోని ముంబయిలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023’ పేరుతో ఓ ప్రముఖ టీవీ చానెల్ ఆధ్వర్యంలో ‘2024 ఎన్నికలు – విపక్షాల వ్యూహం’ అనే అంశంపై చర్చ జరుగనున్నది. ఈ చర్చా వేదికలో కవిత పాల్గొని, అభిప్రాయం వ్యక్తం చేయనున్నారు.
చర్చా వేదికలో కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యతను తెలియజేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను సైతం కవిత ఎండగట్టనున్నారు.