Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుది గొప్ప విజయమని ఆయన ట్విటర్లో ప్రశంసించారు. యువ ఆటగాడు కే శ్రీకర్ భరత్.. భారత రెండో ఇన్నింగ్స్లో రత్నమని కేటీఆర్ అభివర్ణించారు. అదేవిధంగా, ఇవాళ్టి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగుల మైలురాయిని దాటిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. బౌలింగ్తో అసీస్ బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచిన స్పిన్ బౌలర్లను మెచ్చుకున్నారు. స్పిన్నర్ల ఆల్రౌండ్ ప్రదర్శన అద్భుతమని మంత్రి కొనియాడారు.
కాగా, ఇవాళ ముగిసిన రెండో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో రెండో ఇన్నింగ్స్లో అసీస్ 113 పరుగులకే కుప్పకూలింది. భారత్ 26.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దాంతో ఐదు రోజుల ఆట మూడు రోజులకే ముగిసింది. తొలి మ్యాచ్లో కూడా భారత్ మూడు రోజులకే అసీస్ను మట్టికరిపించింది.