Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యాదాద్రి
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రాక వల్ల వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ. 33,09,574 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 2,97,400లు, సుప్రభాతం సేవల ద్వారా రూ. 18,500లు, పుష్కరిణీ ద్వారా రూ. 1,500లు, వ్రతాల వల్ల రూ. 1,41,600 లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
అంతే కాకుండా ప్రచార శాఖ ద్వారా రూ. 20వేలు, వీఐపీ దర్శనం ద్వారా లక్షా 80వేలు, యాదరుషి నిలయము ద్వారా రూ. 89,644, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 17,15,750లు ఆదాయం వచ్చిందని వివరించారు. పాతగుట్ట ద్వారా రూ. 29,630లు,కళ్యాణ కట్ట ద్వారా రూ. 96,200లు,శాశ్వత పూజల ద్వారా రూ.15 వేలు, వాహన పూజలకు రూ. 24,700లు, కొండపైకి వాహన ప్రవేశాల వల్ల రూ. మూడు లక్షల 50వేలు ఆదాయం సమకూరిందన్నారు. సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,01,632లు, వేద ఆశీర్వచనం ద్వారా రూ. 5,400లు,శివాలయం ద్వారా రూ. 37,896, అన్నదానము ద్వారా రూ. 2,322లు,బ్రేక్ దర్శనం ద్వారా రూ. 1,82,400లు ఆలయానికి ఆదాయ రూపేణా వచ్చిందని తెలియజేశారు.