Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజస్థాన్
ఉదయ్పుర్ వద్ద గ్రామ యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో కొందరు దుండగులు ఓ యువకుణ్ని తీవ్రంగా హింసించారు. తాళ్లతో కట్టి తలకిందులుగా చెట్టుకు వేలాడదీశారు.
అయితే యువతితో సన్నిహితంగా ఉంటూ ఆమెను కిడ్నాప్ చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఈ తరుణంలోనే యువకుడిని వేలాడదీసి కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో పోలీసులు సంఘటన స్థాలినికి చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాధిత యువకుడితోపాటు అతడితో సంబంధం ఉందని భావిస్తున్న యువతి వివరణను పోలీసులు నమోదు చేశారు.