Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
వినియోగదారుల కోసం మెటా వెరిఫైడ్ పేరుతో చెల్లింపు ధ్రువీకరణ సేవలను ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. ట్విటర్ బ్లూటిక్ మాదిరిగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు కలిపి ధ్రువీకరణ గుర్తింపు కోసం నెలవారీ చందా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ధ్రువీకరణ ప్రకారమే ఖాతాకు బ్లూబ్యాడ్జ్ కేటాయిస్తారు.
2022లో అంతర్జాతీయ మాంద్యం, యాపిల్ ఐఓఎస్ గోప్యతా విధానం మార్పుల కారణంగా ప్రకటనల రాబడి తగ్గింది. ఈ తరుణంలో ఆదాయాలు పెంచుకోవాలని మెటా చూస్తోంది. ఈ ధ్రువీకరణ సేవల కోసం నెలకు వెబ్పై 11.99 డాలర్లు, ఐఓఎస్పై 14.99 డాలర్లు వసూలు చేయనున్నారు. సబ్స్క్రిప్షన్లపై యాపిల్ 30 శాతం కమీషన్ ఫీజు వసూలు చేస్తున్నందున, ఐఓఎస్పై ఈ ఛార్జీ అధికంగా ఉండనుంది. అయితే ఆండ్రాయిడ్పై ఈ సేవలకు సంబంధించి స్పష్టత రాలేదు.