Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అనారోగ్యంతో కన్నుమూసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ సాయన్న మరణ వార్త అందరినీ కలచి వేసిందన్నారు. కంటోన్మెంట్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తుచేశారు. ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడన్నారు.
సాయన్న మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాని తెలిపారు. ఈ క్రమంలో సాయన్న భౌతికకాయానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి నివాళులు అర్పించారు.