Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఓటమి తర్వాత కమ్మిన్స్ కుటుంబ కారణాల వల్ల స్వదేశానికి వెళ్లినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ తెలిపింది. అయితే కమ్మిన్స్ ఫ్యామిలీ సభ్యుల్లో తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు ఈ క్రమంలోనే కమ్మిన్స్ స్వదేశానికి వెళ్ళినట్లు తెలియజేసింది.
అయితే మార్చి ఒకటో తేదీన ఇండోర్లో ప్రారంభంకానున్న మూడవ టెస్టు కంటే ముందే కమ్మిన్స్ మళ్లీ ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో పర్సనల్ కారణాల వల్ల కమ్మిన్స్ ఇంటికి వెళ్లినట్లు సీఏ సోమవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అతని ప్రైవసీని మీడియా గౌరవించాలని సీఏ తన ప్రకటనలో కోరింది.