Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చత్తీస్ఘడ్
బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చత్తీస్ఘడ్ లో 14 చోట్ల ఇవాళ సోదాలు నిర్వహిస్తోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నేతల ఇండ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీనర్ జరగనున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే ఎమ్మెల్యేలు, ఆఫీసు బేరర్లకు చెందిన ప్రదేశాల్లోనే ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
సీఎం భూపేశ్ భగల్తో వారందరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బొగ్గు స్కామ్లో లబ్దిపొందిన నేతల ఇండ్లల్లోనే దాడులు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. స్కామ్ సొమ్మును పార్టీ ఫండ్గా మలుపుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధుల్ని ఖైరాఘర్ బైపోల్స్ సమయంలో వాడినట్లు తెలుస్తోంది. ఆరి డోంగ్రి మైనింగ్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. టన్ను బొగ్గు సరఫరాపై అక్రమంగా రూ.25 వసూల్ చేసి.. 2021లో సగటున సుమారు 500 కోట్లు వసూల్ చేసినట్లు ఈడీ ఆరోపించింది.