Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం వరకు అభిమానుల నీరాజనాల మధ్య సినీ నటుడు తారకరత్న అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి మోహనకృష్ణ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నకు కన్నీటి వీడ్కోలు పలికారు.
అంతకుముందు ఫిలించాంబర్లో అభిమానులు, సినీ ప్రముఖులు తారకరత్న పార్థీవ దేహానికి నివాళి అర్పించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర సాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి నందమూరి అభిమానులు అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని తారకరత్నకు తుది వీడ్కోలు పలికారు.