Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్ మారేడుపల్లి శ్మశానవాటికలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి. సాయన్న అంత్యక్రియలు నిర్వహిస్తుండగా... శ్మశానవాటిక వద్ద ఎమ్మెల్యే సాయన్న అనుచరుల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అనుచరులు ఆందోళనకు దిగారు. సాయన్న అంత్యక్రియలను అభిమానులు అడ్డుకున్నారు. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పోలీసు అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. మంత్రి తలసాని శ్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంటే మంత్రి మల్లారెడ్డి సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మరోవైపు శ్మశానవాటికకు భారీగా సాయన్న అభిమానులు చేరుకుని.. ఆందోళన చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వయసు 71 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన... ఈనెల 16న కుటుంబసభ్యులు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయనకు ఈనెల 19న హార్ట్ అటాక్ రావడంతో కన్నుమూశారు. గతంలోనే సాయన్నకు గుండె ఆపరేషన్ జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.