Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గతంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా మూడోసారి అమ్మాయి పుట్టడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ ఔట్పోస్టు ఎస్సై కిషన్జీ తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్నగర్కు చెందిన మహ్మద్ అహ్మద్(35)కు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పర్నిచర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం భార్య కాన్పుకోసం కర్ణాటక రాష్ట్రంలోని తన పుట్టింటికి వెళ్లింది. మూడోసారి కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో అహ్మద్ కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహ్యత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.