Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ
గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ వర్గీయుల దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై దాడులు, బెదిరింపులు, విధ్వంసాలకు తెగబడుతోందని మండిపడ్డారు. గన్నవరంలో విధ్వంసానికి పాల్పడిన వైకాపా శ్రేణులను వదిలేసి, టీడీపీ వారిని పోలీసులు అరెస్టులు చేయటం దుర్మార్గమన్నారు. పోలీసులు స్వతంత్ర ప్రతిపత్తిని వదిలి, అధికార వైపాకాకు అనుకూలంగా వ్యవహరించడం తగదన్నారు. రాజకీయాల్లో భౌతిక దాడులను ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని రామకృష్ణ అన్నారు.