Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ తమిళ సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చెన్నై కొడంబాక్కంలోని మెడ్ వే ఆస్పత్రికి తరలించారు.
ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం లేజర్ సర్జరీ నిర్వహించి మూత్రపిండంలోని రాళ్లను తొలగించారు. అనంతరం ప్రభు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉండే అవకాశం ఉంది.