Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడమే తమ ప్రధాన ఎజెండా అని ఢిల్లీ నూతన మేయర్ షెల్లీ ఒబెరాయ్ అన్నారు. ఇవాళ ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి ఆమె మీడియాతో మాట్లాడుతూ మా కోర్ కమిటీ త్వరలోనే ఢిల్లీలోని చెత్త డంపింగ్ ప్రాంతాలను పరిశీలించి, నగరంలో చెత్త సమస్య పరిష్కారానికి మార్గాలు చూపుతానని తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ చట్టానికి అనుగుణంగా తాను తన విధులు నిర్వహిస్తామనని, ఎంసీడీ ఎన్నికల సందర్భంగా మా ముఖ్యమంత్రి 10 హామీలు ఇచ్చారని, ఆ హామీలన్నీ నెరవేర్చేందుకు తాము కృషిచేస్తామని అన్నారు.