Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని టిటిడి పేర్కొంది. భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 62,101 మంది భక్తులు దర్శంచుకున్నారు. 25,896 మంది భక్తులు తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్శించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు అని ఆలయ అధికారులు వెల్లడించారు.