Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 59,706 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,748 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.77గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐటీసీ, విప్రో, ఎల్అండ్టీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, పవర్గ్రిడ్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, టైటన్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టపోతున్నాయి.