Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని ఉట్నూర్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి అక్రమంగా తరలిస్తున్న 92 కిలోల గంజాయిని ఆదిలాబాద్ పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అంతరరాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
ఉట్నూర్కు చెందిన మహమ్మద్ సద్దాం, రెహ్మాన్ ఖాన్, పవర్ రాజు, శ్రీకర్ గత కొన్ని రోజులుగా ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో అధిక ధరలకు అమ్ముతున్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం రెండు కార్లలో నలుగురు నిందితులు 92 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా మావల వద్ద పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.