Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమ్స్ ఆసుపత్రి దగ్గర బీజేపీ మోర్చా ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థిని ప్రీతి చికిత్స వివరాలు ఎందుకు తెలపడం లేదని నిరసనకు దిగారు. ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో బీజేపీ మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ మోర్చా నేతల మధ్య పరస్పరం తోపులాట జరిగింది. దీంతో నిమ్స్ ఆసుపత్రి దగ్గర పోలీసుల భారీ బందోబస్తు చేశారు. ఎవరూ లోనికి వెళ్లకుండా ఆసుపత్రి గేట్లు పోలీసులు మూసేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.