Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల గురువారం భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ లో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రి, పలువురు మైనారిటీ నాయకులు భారాస రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్గా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్, టీడీపీల్లోనూ కొంతకాలం పని చేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.