Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదం జరిగిన గోదాము చుట్టూ మరికొన్ని గోడౌన్లు ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. మంటలను ఇతర గోదాములకు వ్యాపించకుండా చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.