Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ భాటపరాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు-గూడ్స్ వాహనం పరస్పం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.