Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 216 పాయింట్ల లాభంతో 59,822 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 17,575 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.66 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ, టైటన్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ, ఐటీసీ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.