Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరి జరిగింది. ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరికి గురయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు సమాచారం. ఆలయాన్ని మూసివేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఆలయం వెనుక గుట్ట దిగువన సీతమ్మ బావి వరకూ వెళ్లి డాగ్ స్క్వాడ్ ఆగింది.